తెలంగాణ

telangana

ETV Bharat / state

'దేవాలయాలకు కూడా అనుమతినివ్వాలి' - corona effect

హైదరాబాద్​ గోషామహల్​లోని ఇసామియాబజార్​లో పేదలకు భాజపా నాయకుడు ఓం ప్రకాశ్​ నిత్యావసరాలు అందజేశారు. రాష్ట్రంలో దేవాలయాలకు సైతం అనుమతినివ్వాలని ఓం ప్రకాశ్​ డిమాండ్​ చేశారు.​

food distribution to poor in goshamahal
'దేవాలయాలకు కూడా అనుమతినివ్వాలి'

By

Published : May 9, 2020, 3:47 PM IST

రాష్ట్రంలో మద్యం షాపులను అనుమతించిన ప్రభుత్వం... దేవాలయాల్లో భౌతిక దూరం పాటిస్తూ పూజలు చేసుకొనేందుకు అనుమతివ్వాలని భాజపా డిమాండ్ చేసింది. హైదరాబాద్​ గోషామహల్ నియోజకవర్గంలోని ఇసామియా బజార్​లో బస్తీ వాసులకు భాజపా నాయకుడు ఓం ప్రకాశ్​ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రతి భాజపా కార్యకర్త పేదల ఆకలి తీర్చాలంటూ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు... ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఓం ప్రకాశ్​ తెలిపారు.

లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... లాక్​డౌన్ పూర్తయ్యేవరకు ప్రతి బస్తీలో పేదల ఆకలి తీర్చేందుకు పని చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం కంటే... ఖాజానాపైనే ఆసక్తి ఉందని ఓం ప్రకాశ్​ ఎద్దేవా చేశారు.

ఇదీ చూడండి :భోపాల్​ నుంచి విశాఖ వరకు.. చీకటి నింపిన గ్యాస్​ లీక్​లెన్నో..

ABOUT THE AUTHOR

...view details