విశ్వవిద్యాలయాలలో బోధనతో పాటు.. పరిశోధనలు పెంచి.. విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. పాలమూరు, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ , ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్తో సమీక్షలు నిర్వహించారు.
జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహించాలని గవర్నర్ సూచించారు. కొవిడ్ అనంతర పరిస్థితులలో విద్యార్థుల ప్రయోజనాల కోసం భారీగా ఆన్లైన్ వనరులను సృష్టించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందుబాటులో ఉండేలా లైబ్రరీలను డిజిటలైజ్ చేయాలని గవర్నర్ సూచించారు. ఆన్లైన్ తరగతులకు సంబంధించిన వీడియో పాఠాలు, ఉపన్యాసాలు.. విశ్వవిద్యాలయం డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు.