తెలంగాణ

telangana

ETV Bharat / state

జీహెచ్​ఎంసీ కార్యాలయం ఎదుట వరద ముంపు బాధితుల ధర్నా - జీహెచ్​ఎంసీ కార్యాలయంలో వరద బాధితుల ధర్నా

వరద ముంపు ప్రాంతాల్లోని బాధితులు హైదరాబాద్​ అబిడ్స్​లోని జీహెచ్​ఎంసీ సర్కిల్​ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అకాల వర్షాలకు నష్టపోయిన వరద ముంపు ప్రాంతాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.పది వేల ఆర్థిక సహాయం తమకు అందట్లేదంటూ నిరసనకు దిగారు.

flood victims protest at abids hyderabad
జీహెచ్​ఎంసీ కార్యాలయం ఎదుట వరద ముంపు బాధితుల ధర్నా

By

Published : Oct 31, 2020, 4:37 PM IST

వరద ముంపు ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.పది వేల ఆర్థిక సహాయం అందక బాధితులు హైదరాబాద్​ అబిడ్స్​ ప్రాంతంలో ఆందోళనకు దిగారు. గోశామహల్​, బేగంబజార్, ఆసిఫ్​నగర్​ ప్రాంతాల్లో ఆర్థిక సహాయం అందని బాధితులు... అబిడ్స్​లోని జీహెచ్​ఎంసీ సర్కిల్​ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదలమంటూ కార్యాలయం ఎదుట బైఠాయించారు.

కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగగా కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వరదల వల్ల ముంపునకు గురైన వారికి ఆర్థిక సాయం చేయకుండా అధికార పార్టీ నాయకులు చెప్పినవారికి డబ్బులు పంచుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:20 రోజుల్లో వ్యవసాయేతర ఆస్తులకు రిజిస్ట్రేషన్‌: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details