తెలంగాణ

telangana

పులిచింతల జలాశయానికి వరద ప్రవాహం

By

Published : Oct 20, 2020, 3:10 PM IST

ఏపీలోని పులిచింతల జలాశయానికి ఎగువ నుంచి వరద నిలకడగా కొనసాగుతోంది. ప్రస్తుతం 4లక్షల 89 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు.

flood-continues-to-pulichintala-reservoir
పులిచింతల జలాశయానికి కొనసాగుతున్న వరద

ఆంధ్రప్రదేశ్​లోని పులిచింతల జలశయానికి వస్తున్న వరద మేరకు ప్రాజెక్టు 17గేట్లు ఎత్తి... 4లక్షల 68వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

విద్యుత్ ఉత్పత్తి కోసం 8వేల క్యూసెక్కుల నీటిని కేటాయించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 43.84 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరదలో కొంతమేర పెరుగుదల ఉండటంతో... అందుకు తగ్గట్లుగా మరికొన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి:శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details