తెలంగాణ

telangana

ETV Bharat / state

'త్వరలో ఆన్లైన్​లో ఫిట్​నెస్ శిక్షణ తరగతులు'

క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో పాత్రికేయులకు నిత్యావసరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీ నాథ్, సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర్​రెడ్డి పాల్గొన్నారు. లాక్​డౌన్ నేపథ్యంలో యువతకు రాష్ట్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఆన్లైన్​లో శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

By

Published : Apr 13, 2020, 3:18 PM IST

Fitness training classes online soon in telangana
'త్వరలో ఆన్లైన్​లో ఫిట్​నెస్ శిక్షణ తరగతులు'

క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో పాత్రికేయులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్​గౌడ్, ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీ నాథ్, సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర్​రెడ్డి పాల్గొన్నారు. కరోనా వ్యాధి పట్ల జాగ్రత్తలు పాటించాలని పీవీ సింధు కోరారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకి వచ్చేవారు తప్పనిసరిగా మస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని ఆమె సూచించారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా​ను కట్టడి చేయడంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కరోనా వైరస్ నివారణకు సీఎం కేసీఆర్, కేటీఆర్లతోపాటు వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు విశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈనెల 30 తరవాత లాక్​డౌన్​ను పొడిగించకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరారు. త్వరలో యువతకు ఆన్​లైన్​లో యోగా, ఏరోబిక్స్ వంటి ఫిట్​నెస్ తరగతులను నిర్వహించేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

'త్వరలో ఆన్లైన్​లో ఫిట్​నెస్ శిక్షణ తరగతులు'

ఇదీ చూడండి :చిట్టీ వసూళ్ల పేరుతో వేధింపులు వద్దు

ABOUT THE AUTHOR

...view details