హైదరాబాద్ జిల్లా మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ఎన్టీఆర్ స్టేడియంలో ఫిష్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఛైర్ పర్సన్ పద్మ బెస్త తెలిపారు. సికింద్రాబాద్ వెస్ట్ మారెడ్ పల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫిష్ ఫెస్టివల్ పోస్టర్ను ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా సూమారు 30 స్థానిక సంఘాలతో సమన్వయం చేసుకుంటూ ఈ ఫెస్టివల్ చేపడుతున్నట్లు ఆమె వెల్లడించారు.
పోషకాలు పుష్కలం...
పెద్ద ఎత్తున కొవ్వు పదార్థాలుండే చికెన్, మటన్ తింటూ ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని పద్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ పౌష్టికాహారమైన చేప వంటకాలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 28, 29తోపాటు మార్చి 1న ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరికి చేప ప్రాధాన్యతను తెలియజేయాలనే ఈ వంటకాలను తయారు చేయనున్నట్లు స్పష్టం చేశారు. నగర వాసులకు ఆరోగ్యకరమైన చేప వంటకాలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు.
ఫిష్ ఫెస్టివల్ పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి తలసాని ఇవీ చూడండి : ట్రంప్తో దావత్కు.. సీఎం కేసీఆర్