తెలంగాణ

telangana

ETV Bharat / state

'ట్విట్టర్, ఫేస్​బుక్ సీఈవోలపై కేసు నమోదు చేయాలి'

భారత జవాన్​లపై విష ప్రచారం చేస్తున్న వారిపై, ఆయా సమాచారం తొలగింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సామాజిక మాధ్యమాలు ట్విట్టర్, ఫేస్ బుక్​లపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని  హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ డీజీపీని కోరారు.

By

Published : Aug 8, 2019, 9:12 PM IST

విష ప్రచారాలు చేస్తున్న వారిని కట్టడి చేయడంలో ట్విట్టర్ , ఫేస్​ బుక్ విఫలం : న్యాయవాది

ట్విట్టర్, ఫేస్​బుక్ సీఈవోలపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని డీజీపీకి హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. 370 ఆర్టికల్ రద్దుపై సామాజిక సాధనాల ద్వారా దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వీటిని ప్రోత్సహిస్తున్న ఫేస్​బుక్, ట్విట్టర్ సీఈవోలపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ట్విట్టర్, ఫేస్​బుక్​లను వేదికగా చేసుకుని భారత ఆర్మీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిని కట్టడి చేయడంలో ఈ రెండు సంస్థలు విఫలమయ్యాయన్నారు. ఈ విషయంపై ఇప్పటికే మెయిల్ ద్వారా ఫేస్​బుక్, ట్విట్టర్ సీఈఓలకు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర మూకలకు కొమ్ముకాస్తూ ఆర్మీపై అసత్య ప్రచారాలు చేస్తున్న సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి న్యాయవాది విజ్ఞప్తి చేశారు.

విష ప్రచారాలను కట్టడి చేయడంలో ట్విట్టర్ , ఫేస్​ బుక్ విఫలం : న్యాయవాది
ఇవీ చూడండి : నేడు తీవ్రరూపం దాల్చనున్న జూడాల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details