తెలంగాణ

telangana

ETV Bharat / state

'హైదరాబాద్ అందాలకు ఫిదా'

15వ ఆర్థిక సంఘం ప్రతినిధుల బృందం హైదరాబాద్​లోని పలు చారిత్రక కట్టడాలను సందర్శించారు. చార్మినార్ నిర్మాణం, హైదరాబాద్ చరిత్ర, చార్మినార్ పెడిస్టేరియన్ ప్రాజెక్టు, ఫలక్​ నుమా ప్యాలెస్​లను తిలకించారు.

By

Published : Feb 19, 2019, 10:04 PM IST

వివరిస్తున్న దాన కిషోర్​

మూడురోజుల రాష్ట్ర పర్యటనకొచ్చిన 15 వ ఆర్థిక సంఘం సభ్యులు ఇవాళ ఉదయం నగరంలోని పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. భాగ్యనగరానికే తలమానికమైన చార్మినార్‌ను చూసి మంత్రముగ్ధుల‌య్యారు. హైద‌రాబాదీ ఇరానీ చాయ్‌ను ఆస్వాదించారు. రూ. 36 కోట్లతో చేపడుతున్న చార్మినార్ పెడిస్టేరియ‌న్ ప్రాజెక్ట్ ప‌నుల పురోగ‌తి, ప్రణాళిక‌ల‌పై జీహెచ్​ఎంసీ క‌మిష‌న‌ర్ బృందానికి వివ‌రించారు.

ఫ‌ల‌క్‌నుమా అందాలకు ఫిదా

ప్రపంచంలోనే అద్భుత కట్టడాల్లో ఒక‌టైన ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌ను కూడా ఆర్థిక సంఘం సభ్యులు సందర్శించారు. ఆ కట్టడం విశిష్టతను ప‌ర్యాట‌క శాఖ అధికారులు వివ‌రించారు. ఈ చారిత్రక భవనంలో సభ్యులు తేనీరు సేవించారు.

ABOUT THE AUTHOR

...view details