తెలంగాణ

telangana

By

Published : Nov 23, 2020, 9:15 PM IST

ETV Bharat / state

జీహెచ్​ఎంసీ ఎన్నికల బరిలో 1,122 మంది

గ్రేటర్ ఎన్నికల్లో 150 వార్డుల్లో మొత్తం 1,122 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ఎన్నికల అధికారి లోకేష్​ కుమార్​ తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న అన్ని డివిజన్లలో తెరాస మాత్రమే పోటీ చేస్తోందని ప్రకటించారు.

final-candidates-list-in-ghmc-elections
జీహెచ్​ఎంసీ ఎన్నికల బరిలో 1,122 మంది

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ ప్రకటించారు. గ్రేటర్​లోని మొత్తం 150 స్థానాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీగా తెరాస నిలిచింది. ఎన్నికలు జరుగుతున్న అన్ని డివిజన్లలో తెరాస అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నవాబ్​సాహెబ్ కుంట డివిజన్​లో తప్ప 149 స్థానాల్లో భాజపా అభ్యర్థులను బరిలో దించింది. కాంగ్రెస్ 146 స్థానాలు, ఎంఐఎం 51 స్థానాలు, తెదేపా 106 స్థానాలు, సీపీఐ 17 స్థానాలు, సీపీఎం 12 డివిజన్లలో అభ్యర్థులు రంగంలో ఉన్నారు.

76 మంది గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులు 415 మంది కూడా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇక అత్యధికంగా జంగ్గంమెట్​ డివిజన్​లో 20 మంది అభ్యర్థులు తలపడున్నారు. అత్యల్పంగా 5 డివిజన్లలో ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉప్పల్, బార్కస్, నవాబ్​ సాహెబ్​కుంట, టోలిచౌకి, జీడిమెట్లలో ముగ్గురేసి అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

క్ర.సం పార్టీ పేరు

పోటీ చేస్తున్న

డివిజన్ల సంఖ్య

1. తెరాస 150 2. భాజపా 149 3. కాంగ్రెస్​ 146 4. ఎంఐఎం 51 5. తెదేపా 106 6. సీపీఐ 17 7. సీపీఎం 12 8. గుర్తింపు పొందిన పార్టీలు 76 9. స్వతంత్రులు 415 మొత్తం 1,122

ఇవీ చూడండి: గ్రేటర్‌ పోరు.. తెరాస ప్రచార హోరు

ABOUT THE AUTHOR

...view details