తెలంగాణ

telangana

ETV Bharat / state

తారకరత్నకు శస్త్ర చికిత్స.. విదేశాల నుంచి వైద్యులను రప్పించే యోచన - Taraka Ratna Latest Health Updates

Taraka Ratna Latest Health Updates: జనవరి 27న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 'యువగళం' పేరుతో ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. పాదయాత్రలో పాల్గొన్న సినీ నటుడు.. నందమూరి తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. దీంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆయనను బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి ఆయన కుటుంబ సభ్యులు విదేశాల నుంచి వైద్యులను రప్పించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Taraka Ratna
Taraka Ratna

By

Published : Feb 4, 2023, 7:58 PM IST

Taraka Ratna Latest Health Updates: సినీ నటుడు నందమూరి తారకరత్న జనవరి 27న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన 'యువగళం' పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ఆరోజు నుంచి నేటి వరకూ బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు ఎనిమిది రోజులుగా అవసరమైన చికిత్సలను అందిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయనకు ఆసుపత్రి వైద్యులు మెదడుకు సంబంధించిన శస్త్ర చికిత్సను పూర్తి చేశారు.

ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ గత 8రోజులుగా తారకరత్న వద్దే ఉంటూ నిత్యం డాక్టర్లతో సంప్రదింపులు జరుపుతూ.. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తారకరత్న మెదడుకు శస్త్రచికిత్స చేసిన అనంతరం స్కాన్ రిపోర్టర్ వచ్చిన తర్వాత డాక్టర్‌ల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లాలని అనుకున్నారు. కానీ, స్కాన్ నివేదిక ఆధారంగా తారకరత్నను విదేశాలకు తరలించే పరిస్థితి లేకపోవడంతో.. విదేశీ వైద్యులను బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి రప్పించే యోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారు.

అసలేెం జరిగిదంటే:చిత్తూరు జిల్లా కుప్పంలో గత నెల 27వ తేదీన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 'యువగళం' పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఆ పాదయాత్రలో నందమూరి తారకరత్న పాల్గొన్నారు. కొద్ది దూరం నడిచిన అనంతరం ఆయన గుండెపోటుకు గురయ్యారు. అప్రమత్తమైన పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు హూటాహూటిన కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్‌ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి గత ఎనిమిది రోజులుగా చికిత్సను అందిస్తున్నారు.

ఇవీ చదవండి:కేసీఆర్​తో వివిధ రాష్ట్రాల నేతల భేటీ.. బీఆర్ఎస్​లో చేరేెందుకు సంసిద్ధత

కొలీజియం సిఫార్సుకు కేంద్రం ఓకే.. ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం

ABOUT THE AUTHOR

...view details