ETV Bharat / state
భూవివాదం కాస్తా ఘర్షణగా మారి రక్తం చిందించింది
పొలం గట్ల దగ్గర జరిగే వివాదాలు తీవ్ర రూపం దాల్చి కొట్టుకునేవరకు వెళ్తుంటాయి. కానీ... నగరం నడిబొడ్డున ఓ స్థలం మాదంటే మాదంటూ రెండు వర్గాల మాటల యుద్ధం కాస్తా రాళ్లు రువ్వుకొని రక్తం చిందించే దాకా వెళ్లింది.
By
Published : Mar 29, 2019, 5:57 AM IST
| Updated : Mar 29, 2019, 7:51 AM IST
పది మంది యువకులను అదుపులోకి
పది మంది యువకులను అదుపులోకి హైదరాబాద్ గోల్కొండ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ భూ వివాదం ఇరువర్గాల మధ్య గొడవకు దారి తీసింది. ఇరువర్గాలు ఒకరిపైఒకరు రాళ్లు రువ్వుకున్నారు. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకొని సుమారు పది మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘర్షణతో ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది. Last Updated : Mar 29, 2019, 7:51 AM IST