తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ పండుగ వచ్చిందంటే చాలు.. వారి వీపు విమానం మోత మోగాల్సిందే..! - ఏపీలో వింత పండగలు

Festival at Andhra Odisha Border Region: పండుగ అంటే కొత్త బట్టలు వేసుకుని, సరదాగా, ఉల్లాసంగా గడపడం కాదంటున్నారు ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతాల గిరిజనులు. ఒంటిపై బట్టలు తీసి.. మాంచి వాతంగా ఉన్న కర్రతో ఒకరికొకరు కొట్టుకోవడంలోనే పండుగ మజా ఉందంటున్నారు. ఇదేం పండుగరా బాబు అనుకుంటున్నారా..! అయితే దీని గురించి తెలుసుకుందాం రండి.

ఈ పండుగ అంటే చాలు వీపు విమానం మోత మోగాల్సిందే..!
ఈ పండుగ అంటే చాలు వీపు విమానం మోత మోగాల్సిందే..!

By

Published : Jan 28, 2023, 3:59 PM IST

Festival at Andhra Odisha Border Region: సాధారణంగా పండుగ అంటే బంధువులు ఇంటికి రావడం.. విందు భోజనం చేయడం లాంటివి చూస్తాం. ఆంధ్రా ఒడిశా సరిహద్దులో గల మల్కన్​గిరి జిల్లా పరిధిలోని ఆంద్రాహాల్ పంచాయతీ కేంద్రంలో ప్రతి ఏడాది జరిగే వింత పండుగ చూపరులను ఆకట్టుకుంటోంది. సంస్కృతి, సంప్రదాయాలు, వేషధారణలో ఎంతో ప్రత్యేకత ఉన్న.. బోండా గిరిజనుల ఆచారాలు భిన్నంగా ఉంటాయి. ప్రతి ఏడాది జనవరి నెలలో జరిగే జట్టి పరబ్ (కొట్టుకునే పండుగ) ప్రత్యేకంగా నిలుస్తుంది.

మొదటగా గ్రామ పూజారి ఇంట్లో ప్రత్యేక పూజలు చేసి పండుగను ప్రారంభిస్తారు. అనంతరం యువకులంతా వచ్చి కొట్టుకుంటారు. కళ్లు చెట్టు కొమ్మలతో వీపులపై గట్టిగా కొట్టుకుంటారు. ఎటువంటి రాగ ద్వేషాలు.. కక్షలు లేకుండా కేవలం ఆచారం కోసమే ఇలా చేస్తామని వారంతా అంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి వీపుల మీద గాయాలకు బంధువులైన మహిళలు పసుపు లేపనం పూస్తారు. కేవలం ఒక గంట జరిగే ఈ పండుగ కోసం గ్రామంలో ఉన్నవారు.. వృత్తి రీత్యా బయట ఉన్న వారూ స్వగ్రామానికి చేరుకుంటారు. పండుగలో భాగంగానే ఇలా చేస్తున్నామని వారు చెప్తుండటంతో పండుగ సర్వత్రా ఆకట్టుకుంటోంది.

ఈ పండుగ అంటే చాలు వీపు విమానం మోత మోగాల్సిందే..!

ABOUT THE AUTHOR

...view details