న్యాయవాదుల హత్య కేసును సీబీఐతో వెంటనే విచారణ జరిపించాలని.. దోషులకు కఠినంగా శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అనంతరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలని స్పష్టం చేశారు.
శోచనీయం..
రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ లేదని.. దంపతులను హత్య చేసి 10 రోజులవుతున్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ఇంత వరకూ స్పందించకపోవడం శోచనీయమని విమర్శించారు. ప్రభుత్వానికి తమపై ఎంత గౌరవం ఉందో అర్థమవుతోందని మండిపడ్డారు. లాయర్లపై హత్యలు, దాడులు నిరసిస్తూ.. మార్చి 9న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.