తెలంగాణ

telangana

ETV Bharat / state

ములుగు సమీపంలో సెంట్రల్ నర్సరీ ఏర్పాటుకు ఎఫ్​డీసీ ప్రతిపాదన

ఛైర్మన్ వంటేరు ప్రతాప్​రెడ్డి అధ్యక్షతన ఎఫ్​డీసీ మూడో వార్షిక సమావేశం ఆన్​లైన్​లో జరిగింది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా సంస్థను తీర్చిదిద్దాలని తీర్మానించారు. టెట్రా ప్యాక్​లకు అవసరమైన పేపర్ బోర్డ్ మెటీరియల్ తయారీ, ఐకియా లాంటి సంస్థలకు కలప సరఫరా తదితర అవకాశాలను పరిశీలించాలని సమావేశంలో చర్చించారు.

By

Published : May 21, 2021, 9:20 AM IST

సెంట్రల్ నర్సరీ ఏర్పాటుకు ఎఫ్​డీసీ ప్రతిపాదన
సెంట్రల్ నర్సరీ ఏర్పాటుకు ఎఫ్​డీసీ ప్రతిపాదన

రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాలకు అవసరమైన మొక్కలు సరఫరా చేసేలా సిద్దిపేట జిల్లా ములుగు సమీపంలో 20 ఎకరాల్లో సెంట్రల్ నర్సరీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ప్రతిపాదించింది. ఛైర్మన్ వంటేరు ప్రతాప్​రెడ్డి అధ్యక్షతన ఎఫ్​డీసీ మూడో వార్షిక సమావేశం ఆన్​లైన్​లో జరిగింది. పర్యావరణం, అటవీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని కార్పొరేషన్​ను పునర్​ వ్యవస్థీకరించాలని సమావేశంలో నిర్ణయించారు. యూకలిప్టస్ పెంపు లాంటి సంప్రదాయ పద్ధతుల నుంచి ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా మార్పులు చేయాలని.. ఆ దిశగా సంస్థను తీర్చిదిద్దాలని తీర్మానించారు. టెట్రా ప్యాక్​లకు అవసరమైన పేపర్ బోర్డ్ మెటీరియల్ తయారీ, ఐకియా లాంటి సంస్థలకు కలప సరఫరా తదితర అవకాశాలను పరిశీలించాలని సమావేశంలో చర్చించారు.

ఎఫ్​డీసీ కోసం హైదరాబాద్ కొత్తగూడలో కొత్త కార్యాలయ సముదాయాన్ని నిర్మించాలని.. ఎకో టూరిజం-ఫారెస్ట్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ కాంప్లెక్స్​గా పేరు పెట్టాలని నిర్ణయించినట్లు ఛైర్మన్ ప్రతాప్​రెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి అటవీ అభివృద్ధి సంస్థ విభజన ప్రక్రియ పూర్తయిందని.. అందుకు అనుగుణంగా రూ.51 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు జారీ చేసిందని సంస్థ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఎఫ్​డీసీ 150 కోట్ల టర్నోవర్​తో 95.49 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించినట్లు వివరించారు. కరోనా విపత్తు వేళ చనిపోయిన వారి దహన సంస్కారాలకు అవసరమైన కలపను ఇప్పటి వరకు 150 మెట్రిక్ టన్నులు ఉచితంగా సరఫరా చేసినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: నేడు వరంగల్​ ఎంజీఎంకు ముఖ్యమంత్రి కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details