తెలంగాణ

telangana

ETV Bharat / state

సాహసయాత్ర... తండ్రి భయాన్ని ఆ కూతురు జయించేసింది! - srikanth and ishanwi

కిలిమంజారో... పర్వతారోహకుడు ఎక్కితే దానిలో పెద్ద విషయమేముంది వారికి అలవాటే అనుకుంటారు. కానీ ఒక సాధారణ వ్యక్తి ఎత్తంటే ఉన్న భయాన్ని పోగొట్టుకునేందుకు సంకల్ప యాత్ర చేపడితే అది గొప్ప విషయమే. ఆ యాత్రలో పదకొండేళ్ల కూతురుని భాగస్వామ్యం చేస్తే అది మరింత గొప్ప విషయం. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేలా... కూతురిలో ధైర్యసాహసాలు నింపేలా ఓ తండ్రి చేసిన అడ్వేంచరే ఇది...

తండ్రి భయాన్ని కలిసి అధిగమించిన తనయ

By

Published : Nov 14, 2019, 8:13 AM IST

Updated : Nov 14, 2019, 9:39 AM IST

తండ్రి భయాన్ని కలిసి అధిగమించిన తనయ

శ్రీకాంత్ యూఎస్​లో నేవీ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన కుటుంబం హైదరాబాద్​లో స్థిరపడింది. తనలోని భయాన్ని పొగొట్టుకునేందుకు ఎత్తైన ప్రదేశాలను అధిరోహించాలనుకున్నాడు. ఇందుకోసం కిలిమంజారోను ఎంచుకున్నాడు. కుటుంబసభ్యులూ అంగీకరించారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా... ఈ యాత్రకు తన పదకొండేళ్ల కుమార్తె ఇషాన్వీని తీసుకెళ్లాలనుకున్నాడు. ఇది ఇంట్లో వారిని కలవరపెట్టింది.

ఆత్మస్థైర్యం నింపేందుకే...

ఇషాన్వీలో ఆత్మస్థైర్యం నింపేందుకే తీసుకెళతానని అందరిని ఒప్పించాడు. కిలిమంజారో అధిరోహణకు ఇద్దరు సిద్ధమయ్యారు. తన కుమార్తె పర్వతంపైనున్న వాతావరణ పరిస్థితులు ఎదుర్కోగలదా అని భయపడ్డాడు. ఇది అధిగమిస్తే తన జీవితంలో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటుందన్న భావనతో యాత్రను ప్రారంభించారు.

ఎమోషనల్​గా సాగిన యాత్ర...

యాత్రకు సంబంధించిన ప్రతీ చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ... సమయానుగుణంగా ఇషాన్వీకి ఆహారం అందిస్తూ ఎనిమిది రోజులు యాత్రను కొనసాగించాడు. జర్నీ అంతా చాలా ఎమోషనల్​గా సాగిందని పేర్కొన్నాడు. కూతురు ఇబ్బంది పడిన ప్రతీసారి మరింత జాగ్రత్తలు తీసుకున్నానని శ్రీకాంత్ వెల్లడించారు. కిలిమంజారో అగ్రభాగానికి చేరుకున్నాక తన భయాన్ని అధిగమించిన దానికంటే తన కుమార్తె సాధించిన ఘనతే రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చినట్లు పేర్కొన్నాడు.

నాన్న చెప్పేవరకు తెలియదు...

తన తండ్రి చెప్పేవరకు కిలిమంజారో గురించి తెలియదని... ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే ఈ విజయం సాధించినట్లు ఇషాన్వీ తెలిపింది. తరగతిలోని విద్యార్థులు ఓ సెలబ్రిటీలా చూస్తున్నారని... అది ఎంతో సంతోషాన్ని ఇస్తోందని పేర్కొంది.

చిన్ననాటి నుంచే ఆడపిల్లల్లో ధైర్యసాహాసాలు నూరిపోయడం అందరి కర్తవ్యం. నేటి సమాజంలో భిన్న పరిస్థితులను ఎదుర్కొనడంలో వారి సాహసాలే ఎంతగానో ఉపయోగపడతాయి.

ఇవీ చూడండి: 'శబరిమల' తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ- భద్రత కట్టుదిట్టం

Last Updated : Nov 14, 2019, 9:39 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details