తెలంగాణ

telangana

ETV Bharat / state

విలేకర్లమంటూ డబ్బులు వసూలు.. ఐదుగురి అరెస్ట్​

విలేకరులమంటూ పలు బ్యూటీ స్పా సెంటర్లలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఐదుగురిని ఎస్‌ఆర్‌ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఎవరైనా విలేకరులమని చెప్పి డబ్బులు వసూలు చేస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.

By

Published : Aug 17, 2019, 11:56 PM IST

విలేకర్లమంటూ డబ్బులు వసూలు చేసిన ఐదుగురి అరెస్ట్​

విలేకరులమని చెప్పి అక్రమవసూళ్లకు పాల్పడుతున్న ఐదుగురిని హైదరాబాద్​ ఎస్ఆర్​నగర్​ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల ఏడున ఆర్​వై ఫ్యామిలీ స్పా సెంటర్​కు సురేందర్​ రాజు, ఎస్​. కిరణ్​ కుమార్​, టి. రఘునాథ చారి, రాజా కిషన్​, బి. రవి అనే వ్యక్తులు వచ్చి తాము విలేకరులను నమ్మించారు. నగరంలోని ఓ స్పా సెంటర్​లో రూ. 50 వేలు వసూలు చేశారు. నిందితులు అంబర్​ పేట, గాజులరామారం, బాలాపూర్​, కాచిగూడ, ఘట్​కేసర్​ ప్రాంతాలకు చెందినట్లు పోలీసులు గుర్తించారు. స్పా యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, రిమాండ్​కు తరలించారు.

విలేకర్లమంటూ డబ్బులు వసూలు చేసిన ఐదుగురి అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details