తెలంగాణ

telangana

ETV Bharat / state

బాంబు ఉందంటూ మెయిల్.. పోలీసుల ఉరుకులు పరుగులు... - Delhi Public School Bomb Police Checkings

హైదరాబాద్​లో మరోసారి తప్పుడు సమాచారం పోలీసులను పరుగులు పెట్టించింది. నాచారంలోని దిల్లీ పబ్లిక్ స్కూల్​లో బాంబు ఉందని వచ్చిన మెయిల్​ కాసేపు కలకలం సృష్టించింది.

DPS BOMB
DPS BOMB

By

Published : Mar 10, 2020, 9:46 PM IST

హైదరాబాద్ నాచారంలోని దిల్లీ పబ్లిక్ స్కూల్​లో బాంబు ఉందని... ఓ బెదిరింపు లేఖ మెయిల్ ద్వారా వచ్చింది. వెంటనే స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. పిల్లలందరిని ఇళ్లకు పంపించారు.

సుమారు 3గంటలు వెతికిన ఎలాంటి బాంబు దొరకలేదు. ఎవరో అగంతకుడు కావాలనే తప్పుడు సమాచారం మెయిల్ చేశారంటూ పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి కోసం దర్యాప్తు ప్రారంభించారు.

బాంబు ఉందంటూ మెయిల్.. పోలీసుల ఉరుకులు పరుగులు...

ఇదీ చూడండి:రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకానికి కమిటీ ఏర్పాటు

ABOUT THE AUTHOR

...view details