తెలంగాణ

telangana

ETV Bharat / state

నకిలీ వీసాల తయారి ముఠా అరెస్ట్​

నకిలీ వీసాలు తయారు చేసి మనుషులను విదేశాలకు తరలిస్తున్న ముఠాను రాజీవ్​ గాంధీ విమానాశ్రయ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితులపై పీడీ యాక్ట్​ నమోదు చేశారు.

By

Published : Jun 23, 2019, 5:15 AM IST

Updated : Jun 23, 2019, 7:16 AM IST

నిందితులు

హైదరాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు నకిలీ వీసాలు తయారు చేసి అక్రమంగా తరలిస్తున్న నలుగురు ఏజెంట్లపై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదు చేశారు. తోట కంటేశ్వర్ అలియాస్ ఎస్ మణికంఠ, గడ్డం శశి అలియాస్ సత్య, వెంకట పుష్పవతి, చింతల సాయి రామ్ కుమార్, పోతుల సురేందర్ అనే ఏజెంట్లు నకిలీ వీసాలు తయారు చేసి అక్రమంగా మనుషులను పంపిస్తున్నారని శంషాబాద్ విమానాశ్రయం సీఐ రామకృష్ణ తెలిపారు. గతంలో వీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను నకిలీ వీసాలపై విదేశాలకు పంపించారన్నారు. నిందితులపై విమానాశ్రయ ఠాణాలో 12 కేసులు నమోదయ్యాయన్నారు.

నకిలీ వీసాల తయారి ముఠా అరెస్ట్​
Last Updated : Jun 23, 2019, 7:16 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details