తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్​ఫీల్డ్ బైకులతో విపరీతంగా శబ్దకాలుష్యం...! - Extreme sound Pollution with Royal Enfield bikes said by Telangana High court

గ్రేటర్ హైదరాబాద్​లో పెరుగుతున్న కాలుష్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆలస్యం చేస్తే దిల్లీ పరిస్థితి వస్తుందని.. జాగ్రత్తలు చేపట్టాలని కోరుతూ.. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

ఎన్​ఫీల్డ్ బైకులతో విపరీతంగా శబ్ధకాలుష్యం...!

By

Published : Nov 11, 2019, 2:55 PM IST

భాగ్యనగరంలో పెరుగుతున్న శబ్ద, వాయు కాలుష్యంపై ఎమ్. ఆదిత్య.. ఉన్న త న్యాయస్థానంలో పిల్ దాఖలు చేశారు. న్యాయవాది రాపోలు భాస్కర్ పిటిషనర్ తరపు వాదనలు వినిపించారు. నగరంలో అధిక వాహనాల వల్ల రోజురోజుకూ శబ్ద, వాయు కాలుష్యం పెరుగుతోందని వాదించారు. ముఖ్యంగా జంట నగరాల్లో రాయల్ ఎన్​ఫీల్డ్ బైక్స్ వల్ల విపరీతంగా శబ్దం వస్తోందన్నారు.

శబ్ద, వాయు కాలుష్యం వల్ల మహిళలకు గర్భస్రావం, వృద్ధులు, చిన్నారుల్లో వినికిడి లోపం సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. పరిస్థితి ఇలాగే ఉంటే హైదరాబాద్ నగరం కూడా దిల్లీ తరహా ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకునే ప్రమాదం ఉందన్నారు.

పిటిషన్​ను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం... కాలుష్య నియంత్రణ మండలి, బల్దియా కమిషనర్, డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లకు నోటీసులు జారీచేసింది. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి : అయోధ్య తీర్పు ఉంటే.. చలో ట్యాంక్‌బండ్ ఎలా చేస్తారు?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details