తెలంగాణ

telangana

By

Published : Oct 8, 2019, 7:18 AM IST

ETV Bharat / state

టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ పదవీ కాలం పొడిగింపు

తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. మరో మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.

టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ పదవీ కాలం పొడిగింపు

తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు పదవీకాలాన్ని పొడిగిస్తూ రాష్ట్రప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 10తో మూడేళ్ల పదవీకాలం పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో బాలమల్లు పదవీ కాలాన్ని మరో మూడేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ సందర్భంగా బాలమల్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రెండోసారి తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, తెలంగాణలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి కృషిచేస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. 2016 అక్టోబరు 10న ఆయన టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details