భగవాన్ శ్రీసాయిబాబా దైవిక స్పర్శ ద్వారా పవిత్రత పొందిన 9 వెండి నాణేలను లక్ష్మీబాయి ముని మనుమడు, సాయిభక్త లక్ష్మీబాయి షిండే ట్రస్ట్ నిర్వాహకులు అరుణ్ గైక్వాడ్ భాగ్యనగరంలో ప్రదర్శించారు. లక్డీకాపూల్లోని ఓ హోటల్లో దర్శన్ స్థల్ ఆఫ్ సాయిబాబాస్ నైన్ కాయిన్స్, సాయిభక్త లక్ష్మీబాయి షిండే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
నమస్కారం, పాదసేవ, కీర్తన, శ్రవణ, స్మరణ, అర్చన, దాస్యత, ఆత్మనివేదన, సఖ్యత వంటి తొమ్మిది అద్భుతమైన భక్తిభావనలు సూచిస్తాయని అరుణ్ అన్నారు. ఈ వెండి నాణేలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో ప్రదర్శనకు పెట్టనున్న దృష్ట్యా.. తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో సాయి భక్తుల సౌకర్యార్థం ప్రదర్శించామన్నారు.