తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వం పగ సాధిస్తోంది : మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్

ప్రభుత్వం కావాలనే తనపై కేసులు పెట్టి.. కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్​ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తనపై సీఎం కేసీఆర్​ కావాలని కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించారు.

By

Published : Sep 21, 2020, 5:56 PM IST

Ex MLC Ramulu Naik Attend Sr Nagar Police Station
ప్రభుత్వం పగ సాధిస్తోంది : మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్

ప్రభుత్వం తనపై ఉద్ధేశపూర్వకంగాని కేసులు పెట్టి వేధిస్తోందని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్​ అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో పాల్గొన్న తనపై సీఎం కేసీఆర్ కేసులు పెట్టిస్తున్నాడని ఆరోపించారు. గత 13 నెలల క్రితం ఎర్రగడ్డ ప్రాంతంలో జరిగిన చిన్నపాటి గొడవకు తనపై ఎఫ్​ఐఆర్ నమోదు చేసి.. పోలీస్​ స్టేషన్​ చుట్టూ కావాలనే తిప్పుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎస్సార్​ నగర్​ పోలీస్​ స్టేషన్​కు వెళ్లారు.

ఎన్ని కేసులు పెట్టినా భయపడనని.. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతానని అన్నారు. గతంలో జరిగిన గొడవ కేసు పెండింగ్​లో ఉందని కోర్టుకు హాజరు కాకపోవడం వల్ల ఠాణాకు పిలిపించి నోటీసులు ఇచ్చినట్లు సీఐ సైదులు తెలిపారు.

ఇదీ చదవండి:మృత్యు కుహరాలుగా మారుతున్న నాలాలు

ABOUT THE AUTHOR

...view details