తెలంగాణ

telangana

ఆ మూడు పార్టీలది ఊసరవెళ్లి స్వభావం: షబ్బీర్ అలీ

By

Published : Nov 19, 2020, 8:01 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఊసరవెళ్లిలా రంగులు మార్చే పార్టీలు ప్రజలను మభ్యపెట్టడానికి ముందుకొస్తున్నాయని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

ఆ మూడు పార్టీలది ఊసరవెళ్లి స్వభావం: షబ్బీర్ అలీ
ఆ మూడు పార్టీలది ఊసరవెళ్లి స్వభావం: షబ్బీర్ అలీ

హైదరాబాద్‌ నగరంలో జరిగిన అభివృద్ధి అంతా కాంగ్రెస్‌ హయాంలో జరిగిందేనని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ అన్నారు. మెట్రోరైల్, పీవీ ఎక్స్‌ప్రెస్‌ వంతెన, శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, ఓఆర్‌ఆర్‌, కృష్ణా నీటి తరలింపు తదితరాలు తామే తెచ్చామని ఆయన వివరించారు.

తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క మోరీ అయినా శుభ్రం చేయలేదని ఆరోపించారు. ఊసరవెళ్లి రంగులు మార్చినట్లు మార్చుకుని మూడు పార్టీలు వస్తున్నాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భాజపా, తెరాసలు పిల్లి- ఎలుక ఆట ఆడుతున్నాయని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి :పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటుకు నిబంధనలు ఇవే...

ABOUT THE AUTHOR

...view details