తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Dec 19, 2023, 3:18 PM IST

Updated : Dec 19, 2023, 5:24 PM IST

ETV Bharat / state

రాజకీయ కక్ష సాధింపుతోనే నాపై కేసులు - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి మల్లారెడ్డి

Ex Minister Malla Reddy Files Quash Petition : రాజకీయ కక్ష సాధింపుతోనే తనపై కేసు పెట్టారని మాజీ మంత్రి మల్లారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని కోర్టును కోరారు. ఈ కేసు ఈ శుక్రవారం విచారణకు రానుంది.

Former Minister Malla Reddy Booked For Cheating Case
Ex Minister Malla Reddy Files Quash Petition

Ex Minister Malla Reddy Files Quash Petition : శామీర్‌పేట పీఎస్‌లో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని మాజీ మంత్రి మల్లారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 6న మల్లారెడ్డిపై ఛీటింగ్, అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. 7 ఎకరాలు కబ్జా చేశారనే ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయ కక్ష సాధింపుతోనే కేసు పెట్టారనిమల్లారెడ్డి (Malla Reddy)పిటిషన్ వేశారు. కాగా ఈ పిటిషన్‌ శుక్రవారం (ఈ నెల 22) విచారణకు రానుంది.

నేను భూకబ్జా చేయలేదు - నాకు అంత అవసరం లేదు : మాజీ మంత్రి మల్లారెడ్డి

శామీర్‌పేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 33, 34, 35లో ఉన్న 47 ఎకరాల 18 గుంటల ఎస్టీ వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి, కుట్రతో మోసగించి భూమిని కాజేశారని శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మాజీమంత్రి మల్లారెడ్డి అతని అనుచరులపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

Former Minister Malla Reddy Booked For Cheating Case : విచారణ చేపట్టిన పోలీసులు మాజీ మంత్రి, అతని అనుచరులైన మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్ రెడ్డి, కేశవపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరి మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (డీసీఎంఎస్) సహకార సంఘం వైస్ ఛైర్మన్, శామీర్‌పేట్ మండల వ్యవసాయ సహకార సేవా సంఘం ఛైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి, శివుడు, స్నేహా రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిలపై శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, 420 ఛీటింగ్ కేసు నమోదు చేశారు.

'ప్రజల కోసం పనిజేసిన - నా నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసిన - మళ్లీ గెలిపిస్తే ఇంకా చేస్తా'

బాధితుడు కేతావత్ బిక్షపతి నాయక్ మాట్లాడుతూ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుంటల భూమి వాళ్ల పెద్దల నుంచి తమకు వారసత్వ హక్కుగా వచ్చిందని తెలిపారు. తమ కుటుంబ సభ్యులైన ఆరుగురి మీద మొత్తం భూమి ఉందని చెప్పారు.

కేసీఆర్​, మల్లారెడ్డి- తోడు దొంగళ్లా భూ కబ్జాలకు పాల్పడుతున్నారు : రేవంత్​రెడ్డి

Last Updated : Dec 19, 2023, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details