తెలంగాణ

telangana

By

Published : May 15, 2020, 2:35 PM IST

ETV Bharat / state

నిత్యావసరాలు పంపిణీ చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ

లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడానికి జాయ్ ఆఫ్ షేరింగ్ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. హైదరాబాద్​లో ఈ సంస్థ ఆధ్వర్యంలో పేదలకు మాజీ జేడీ లక్ష్మీనారాయణ నిత్యావసర సరకులు అందజేశారు.

ex-jd-laxminarayana-distributed-groceries-to-needy-in-hyderbad
నిత్యావసరాలు పంపిణీ చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ

హైదరాబాద్​లో లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతోన్న పేదలను ఆదుకోవడానికి జాయ్ ఆఫ్ షేరింగ్ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. నగరంలోని తాళ్లగడ్డ బీఆర్కే భవన్​లో సుమారు 700 మంది పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

లాక్​డౌన్​లో తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్న వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చిన జాయ్ ఆఫ్ షేరింగ్ స్వచ్ఛంద సంస్థను లక్ష్మీనారాయణ అభినందించారు. కరోనా కట్టడిలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details