హైదరాబాద్లో లాక్డౌన్తో ఇబ్బంది పడుతోన్న పేదలను ఆదుకోవడానికి జాయ్ ఆఫ్ షేరింగ్ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. నగరంలోని తాళ్లగడ్డ బీఆర్కే భవన్లో సుమారు 700 మంది పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ
లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడానికి జాయ్ ఆఫ్ షేరింగ్ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. హైదరాబాద్లో ఈ సంస్థ ఆధ్వర్యంలో పేదలకు మాజీ జేడీ లక్ష్మీనారాయణ నిత్యావసర సరకులు అందజేశారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ
లాక్డౌన్లో తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్న వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చిన జాయ్ ఆఫ్ షేరింగ్ స్వచ్ఛంద సంస్థను లక్ష్మీనారాయణ అభినందించారు. కరోనా కట్టడిలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.