తెలంగాణ

telangana

'శానిటేషన్​లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి'

శానిటేషన్​లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగర మేయర్​ బొంతు రామ్మోహన్​ సూచించారు. జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో శానిటేషన్​పై నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

By

Published : Dec 10, 2019, 5:44 PM IST

Published : Dec 10, 2019, 5:44 PM IST

Everyone in Sanitation needs partners
శానిటేషన్​లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

హైదరాబాద్​ నగరంలో జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు శానిటేషన్​పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈస్ట్​ జోన్​ పరిధిలోని గడ్డి అన్నారంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నగర మేయర్​ బొంతు రామ్మోహన్​ పాల్గొన్నారు. దోమల నియంత్రణకు నూతన ఫాగింగ్ యంత్రాలు ప్రారంభించి సిబ్బందికి అందజేశారు.

ఇతర నగరాలతో పోల్చితే శానిటేషన్​లో మనం చాలా ముందంజలో ఉన్నామని.. నగరంలో ఉన్న సుమారు కోటి మంది జనాభా కోసం దాదాపు 20 వేల మంది కార్మికులు పని చేస్తున్నారని రామ్మోహన్​ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ శానిటేషన్​లో భాగస్వాములు అయినప్పుడే స్వచ్ఛ హైదరాబాద్​ సాధ్యపడుతుందని తెలిపారు. ప్లాస్టిక్​ వాడకాన్ని ప్రజలు పూర్తిగా నిషేధించాలని కోరారు.

నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రత్యేక డ్రైవ్​లో స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, కార్పొరేటర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

శానిటేషన్​లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

ఇదీ చూడండి: ఇవాళ మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ పరిశీలన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details