తెలంగాణ

telangana

ETV Bharat / state

పడవల్లో వరద బాధితుల తరలింపు - New Boinpally flood victims in boats news

చుట్టూ నీరు. నడవడానికి దారి లేదు. ఉండటానికి స్థలం లేదు. ఇంటి నిండా నీరు. ఎటు వెళ్లాలో తెలీదు. ఇది సికింద్రాబాద్ న్యూ బోయినపల్లి సెయిల్ కాలనీ వాసుల పరిస్థితి. కాలనీ నిండా వరద నీరు. ఈ పరిస్థితుల్లో కాలనీ వాసులను పడవలతో సురక్షిత ప్రాంతానికి తరలించారు.

పడవల్లో వరద బాధితుల తరలింపు
పడవల్లో వరద బాధితుల తరలింపు

By

Published : Oct 15, 2020, 5:04 PM IST

భాగ్యనగరంపై వరణుడు విరుచుకుపడ్డాడు. మునుపెన్నడూ లేని విధంగా వర్షాలు కురవడం వల్ల నగరం అతలాకుతలమైంది. చెరువులు, కుంటలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. సికింద్రాబాద్ న్యూ బోయినపల్లి సెయిల్ కాలనీలో వరద బాధితులను పడవలతో తీసుకొచ్చారు. కాలనీలో పూర్తిగా నీరు నిలవడం వల్ల బోర్డ్ సభ్యుడు రామకృష్ణ పడవల్లో వారిని తరలించారు.

పడవల్లో వరద బాధితుల తరలింపు

ABOUT THE AUTHOR

...view details