- భారతావని ప్రగతికి ప్రధాని మోదీ పంచ ప్రాణ ప్రతిష్ఠ
స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ ఆత్మనిర్భర్ భారతావని లక్ష్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. శతాబ్ది వేడుకలు జరుపుకునే నాటికి స్వయంసమృద్ధ దేశంగా అవతరించాల్సిందనేని, ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని తేల్చిచెప్పారు. దశాబ్దాలుగా ‘అభివృద్ధి చెందుతున్న దేశం’గానే కొనసాగుతున్న భారత్ను.. పాతికేళ్లలో ‘అభివృద్ధి చెందిన దేశం’గా అవతరింపజేద్దామంటూ పిలుపునిచ్చారు. అందుకోసం పంచ ప్రాణమంత్రాన్ని ఉపదేశించారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి భూతాన్ని తరిమేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. పరిశోధనలు, నవకల్పనలను ప్రోత్సహించేలా.. ఆధునిక ప్రపంచంలో ఆవిష్కరణల ప్రాధాన్యాన్ని చాటిచెప్పేలా ‘జై అనుసంధాన్’ అంటూ కొత్త నినాదమిచ్చారు.
- మరో ఆరు నెలల్లో ఒమిక్రాన్ను ఎదుర్కొనే టీకా
వచ్చే ఆరు నెలల్లోపే ఒమిక్రాన్ వేరియంట్ను నిరోధించే వ్యాక్సిన్ తీసుకురానున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి ఒమిక్రాన్ వేరియంట్ కారణమని నివేదికలు వస్తోన్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
- బీదర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి
కర్ణాటకలోని బీదర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. బీదర్ జిల్లా బంగూర్ వద్ద హైవేపై కంటైనర్ను వెనకనుంచి ఢీకొన్న ఘటనలో చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. మృతులంతా హైదరాబాద్ నాగోల్ వాసులని, ఒకే కుటుంబానికి చెందినవారని గుర్తించారు. కలబురిగి జిల్లా గాన్గాపూర్కు కారులో దత్తాత్రేయ ఆలయ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
- రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం, హాజరు కాని సీఎం
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, మంత్రులు, తెరాస నేతలు ఎవరూ హాజరుకాలేదు.
- కొత్త వారికి పింఛన్ల పంపిణీ షురూ
స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రభుత్వం 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేసింది. వీరితోపాటు పెండింగ్లో ఉన్నపింఛన్ల దరఖాస్తులను కూడా పరిష్కరించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి పీడీలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆదేశాలు అందాయి.
- రష్దీపై దాడికి వారే కారణం, ఎట్టకేలకు నోరు విప్పిన ఇరాన్