తెలంగాణ

telangana

By

Published : Mar 27, 2020, 7:13 AM IST

ETV Bharat / state

నిజామియా ఆసుపత్రిలో ఐసోలేషన్​ కేంద్రం ఏర్పాటు

హైదరాబాద్​ పాతబస్తీ ఛార్మినార్​ వద్ద గల నిజామియా జనరల్​ ఆసుపత్రిలో కొత్తగా ఐసోలేషన్​ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. కరోనా నివారణ కోసం ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు వారు తెలిపారు.

Hospital
Hospital

కొవిడ్​-19 నివారణకు చర్యలను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. భాగ్యనగరం పాతబస్తీ ఛార్మినార్​ సమీపంలోని నిజామియా జనరల్​ వైద్యశాలలో 12 వార్డుల్లో 180 పడకలతో ఐసోలేషన్​ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా జ్వరం, జలుబు, తుమ్ములు వస్తున్న వారికి అలోపతి ద్వారా చికిత్స అందిస్తామని ఆసుపత్రి చీఫ్​ మెడికల్​ ఆఫీసర్​ మహమ్మద్​ రఫీ తెలిపారు. అటెండర్లను లోనికి అనుమతించమని చెప్పారు. రోగుల అరోగ్య పరిస్థితి క్షీణిస్తే మెరుగైన వైద్యం కోసం తమ ఆస్పత్రి అంబులెన్స్​లో ఇతర ఆసుపత్రికి తరలిస్తామన్నారు.

నిజామియా ఆసుపత్రిలో ఐసోలేషన్​ కేంద్రం ఏర్పాటు

ABOUT THE AUTHOR

...view details