తెలంగాణ

telangana

ETV Bharat / state

600 మంది పేదలకు, వలసకూలీలకు నిత్యావసరాల పంపిణీ - essentials distribution to poor at kbr park

హైదరాబాద్​లోని కేబీఆర్​ పార్క్​ వద్ద 250 మందికి, సైదాబాద్​లోని ఎలమ్మగుడి వద్ద 350 మంది నిరుపేదలకు, వలసకూలీలకు శ్రీకృష్ణ సేవా సంస్థాన్, రేణుక ఎల్లమ్మ గుడి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణీ చేశారు.

essentials-distribution-to-poor-at-saidabad-and-kbr-park
600 మంది పేదలకు, వలసకూలీలకు నిత్యావసరాల పంపిణీ

By

Published : Apr 21, 2020, 7:23 PM IST

కరోనా కష్టకాలంలో భాగ్యనగరంలో సేవా కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. స్వచ్ఛంద సంస్థలకు తోడుగా రాజకీయ నాయుకులు ఎక్కడికక్కడ ప్రజలకు అండగా నిలబడుతున్నారు. ఇలాగే శ్రీకృష్ణ సేవా సంస్థాన్, రేణుక ఎల్లమ్మ గుడి ట్రస్ట్ ఆధ్వర్యంలో సైదాబాద్​లోని ఎలమ్మగుడి వద్ద 350 మందికి, కేబీఆర్​ పార్కు వద్ద 250 మంది పేదలకు, వలసకూలీలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.

ట్రస్ట్​ ఆధ్వర్యంలో ఒక్కరోజే కాక రోజూ తమ స్థోమతకు తగినట్లు సహాయాన్ని అందిస్తున్నట్లు ఆధ్యాత్మివేత్త కృష్ణచాముండేశ్వరి మహర్షి తెలిపారు. కార్యక్రమంలో పోలీసు అధికారులతో పాటు సామాజిక సేవా కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:కరోనా వేళ కేంద్రం కోత.. రాష్ట్రాన్ని నడిపేదెట్టా?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details