- వనస్థలిపురానికి చెందిన ఓ యువకుడు పనిచేసే కార్యాలయంలో సహ ఉద్యోగికి కరోనా నిర్ధరణ అయింది. తాను కూడా పరీక్ష చేసుకునేందుకు వనస్థలిపురంలోని ప్రభుత్వ పరీక్షా కేంద్రానికి వెళ్లాడు. అతని నమూనాలు సేకరించిన సిబ్బంది పేరు, ఫోన్ నంబరును తప్పుగా నమోదు చేశారు. దీనిని గమనించిన యువకుడు వెంటనే వారి దృష్టికి తీసుకెళ్లాడు. అప్పటికే రద్దీ ఉండటంతో మార్పులు చేయకుండా అలానే వదిలేశారు. ఇంతవరకు నివేదిక ఏమైందో తెలియక అతడు ఆందోళన చెందుతున్నాడు.
- ‘మీకు కరోనా పాజిటివ్ వచ్చింది.. చికిత్స కోసం ఆసుపత్రికి రండి’ అంటూ మహేశ్వరానికి చెందిన ఓ అంగన్వాడీ కార్యకర్తకు ఫోన్ వచ్చింది. తనకు ఎలాంటి లక్షణాలు లేవని... అసలు తాను నమూనాలే ఇవ్వలేదని ఆమె వాపోయారు. ఓ నర్సు నుంచి నమూనాలు తీసిన సిబ్బంది ఫోన్ నంబరు తప్పుగా నమోదు చేసుకోవడంతో ఆమెకు బదులు అంగన్వాడీ కార్యకర్తకు సమాచారం వెళ్లినట్లు అధికారులు ఆ తర్వాత గుర్తించారు.
ఆందోళన చెందుతూ..