తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆయన ఎన్నికల కమిషనరా..? రాజకీయ నాయకుడా..?' - ఏపీ రాజకీయ వార్తలు

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్​కుమార్​పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎన్నికల కమిషనరా..? రాజకీయ నాయకుడా..? అని వ్యాఖ్యానించారు. మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.

'నిమ్మగడ్డ ఎన్నికల కమిషనరా..? రాజకీయ నాయకుడా..?'
'నిమ్మగడ్డ ఎన్నికల కమిషనరా..? రాజకీయ నాయకుడా..?'

By

Published : Jan 31, 2021, 7:26 PM IST

'నిమ్మగడ్డ ఎన్నికల కమిషనరా..? రాజకీయ నాయకుడా..?'

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్​కుమార్​పై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ.. ఎన్నికల కమిషనరా..? రాజకీయ పార్టీ నాయకుడా..? అని ప్రశ్నించారు. జిల్లాల్లో తిరుగుతూ ప్రభుత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న రమేశ్​కుమార్...​ ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డిని కించపరిచే విధంగా ప్రవర్తిస్తే ప్రజలు ఉపేక్షించరని హెచ్చరించారు. నిమ్మగడ్డ తాత్కాలికంగా లబ్ధి పొందటమేనని.. అంతిమ విజయం తమదేనన్నారు. నిమ్మగడ్డ వ్యవహారశైలి భిన్నంగా ఉందని... పదవీ విరమణ అనంతరం రాజకీయ ప్రవేశం కోసం తాపత్రయ పడుతున్నట్లు ఉందని విమర్శించారు.

విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి వెల్లంప్లలి శంకుస్థాపన చేశారు. రూ.5 కోట్లతో నిర్మించ తలపెట్టిన రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

ఇదీ చదవండి:'తెలంగాణకు వరద సాయంలో కిషన్​రెడ్డిది కీలకపాత్ర'

ABOUT THE AUTHOR

...view details