తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం సహాయనిధికి విద్యుత్‌ ఉద్యోగుల భారీ విరాళం - Electricity Employeesతెలంగాణ విద్యుత్ సంస్థల ఉద్యోగులు ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళం donate

కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణ విద్యుత్ సంస్థల ఉద్యోగులు ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళం అందించారు. ఉద్యోగుల ఒక రోజు వేతనం మొత్తం రూ.11.40 కోట్ల చెక్కును కేసీఆర్‌కు అందజేశారు.

Electricity Employees donate money to cmrf in hyderabad
సీఎం సహాయనిధికి విద్యుత్‌ ఉద్యోగుల భారీ విరాళం

By

Published : Apr 30, 2020, 7:55 PM IST

తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ సంస్థలకు చెందిన ఉద్యోగులు, పెన్షనర్లతో కలిపి 70వేల మంది తమ ఒక రోజు వేతనం మొత్తం రూ.11.40 కోట్ల ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందించారు. నాలుగు సంస్థలకు చెందిన సీఎండీలు, వివిధ విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకుల సమక్షంలో జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెక్కును అందజేశారు.

కరోనా కష్ట కాలంలో విద్యుత్ ఉద్యోగులంతా రేయింబవళ్లు కష్టపడి నితరంతరం విద్యుత్తు అందిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా అభినందించారు. ఉద్యోగులంతా తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించడం ప్రభుత్వానికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, డైరెక్టర్ సూర్యప్రకాశ్, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు శివాజి, రత్నాకర్ రావు, అంజయ్య, బిసి రెడ్డి, సాయిబాబా, ప్రకాశ్, జాన్సన్, రమేశ్, వజీర్, కుమారస్వామి, సాయిలు, గణేష్, సతన్యనారాయణ, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:గూగుల్‌ మీట్‌ను ఇకపై ఉచితంగా వాడొచ్చు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details