కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. 2021 జనవరి ఒకటి అర్హత తేదీతో జాబితా తయారీ ప్రక్రియ జరుగుతోంది. అందుకు అనుగుణంగా నవంబర్ 16న ముసాయిదా ప్రచురించారు. ముసాయిదా ప్రకారం రాష్ట్రంలో మూడు కోట్ల 55 వేల 327 మంది ఓటర్లున్నారు. అందులో పురుషులు కోటీ 51లక్షల 1236 కాగా.. మహిళలు కోటీ 49 లక్షల 49వేల 876 మంది ఉన్నారు. ఇతరులు 1598 మంది ఓటర్లుగా ఉన్నారు. ఎన్ఆర్ఐ ఓటర్ల సంఖ్య 2617.
అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో
అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 42 లక్షల 70 వేల 614 మంది ఓటర్లు ఉన్నారు. 30 లక్షల 54వేల 338 మంది ఓటర్లతో రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో ఉంది. అత్యల్పంగా ములుగు జిల్లాలో కేవలం రెండు లక్షల 13వేల 794 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. నియోజకవర్గాల వారీగా చూస్తే అత్యధికంగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో ఆరు లక్షల 33 వేల 474 మంది ఓటర్లున్నారు. అత్యల్పంగా భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలంలో లక్ష 43 వేల 514 ఓట్లు ఉన్నాయి. ఈసీ ప్రకటించిన ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, వినతులకు ఈ నెల 15 వరకు గడువుంది. 2021 జనవరి ఒకటి నాటికి 18ఏళ్లు నిండే వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటర్ల జాబితా