వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా ఈటల రాజేందర్ బాధ్యతలు స్వీకరించారు. వైద్యరంగంలో సీఎం కేసీఆర్ కొత్త సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనేది తెరాస ఆశయమన్నారు. వైద్యులపై దాడులు చేయొద్దని సూచించిన ఆయన..గాంధీ ఆసుపత్రి ఘటనలో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జూనియర్ వైద్యులు వెంటనే సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు.
మంత్రిగా ఈటల బాధ్యతలు
రాష్ట్ర మంత్రిగా ఈటల రాజేందర్ బాధ్యతలు చేపట్టారు. పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందజేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఈటల