తెలంగాణ

telangana

ETV Bharat / state

Eenadu Property Show: 'ఈనాడు ప్రాపర్టీషో'తో సొంతింటి కలకు శ్రీకారం

సొంతింటి కలను నిజం చేసుకోవాలని చూస్తున్న వారి కోసం ఈనాడు యాజమాన్యం ఏర్పాటు చేసిన ప్రాపర్టీషో(Eenadu Property Show)కు అమితమైన స్పందన లభిస్తోంది. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్​లో ప్రారంభించిన 31వ ప్రాపర్టీషోకు జనం ఉదయం నుంచే క్యూ కట్టారు. రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రాపర్టీషోలో ప్లాట్లు, విల్లాలు, ఇళ్ల స్థలాలు ఆఫర్ చేయటంతో పాటు కొత్త ప్రాజెక్టుల వివరాలు, ఆఫర్లను డెవలపర్లు కొనుగోలుదారులకు ఆఫర్ చేస్తున్నారు.

By

Published : Oct 30, 2021, 4:56 PM IST

Eenadu Property Show
ఈనాడు ప్రాపర్టీ షో

సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వారి కోసం ఈనాడు యాజమాన్యం మరో సరికొత్త ప్రాపర్టీ షో(Eenadu Property Show)తో ముందుకొచ్చింది. హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 31వ ఈనాడు ప్రాపర్టీ షోను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ప్లాట్లు, విల్లాలతో పాటు పెట్టుబడి కోసం చూసే వాళ్లను దృష్టిలో పెట్టుకుని ఓపెన్ ప్లాట్లను ఈ ప్రాపర్టీ షోలో డెవలపర్లు ఆఫర్ చేస్తున్నారు.

నగరం నలుమూలలతో పాటు హైదరాబాద్ ఆవల పలు ఆకర్షణీయ ప్రాజెక్టులను ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. దిగువ మధ్యతరగతి నుంచి అన్ని వర్గాల వారికి అనువైన ప్రాజెక్టులను డెవలపర్లు ఆఫర్ చేస్తున్నారని, నగర వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

అన్ని ఒకేచోట...

సిటీలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు వేర్వేరు ప్రాంతాల్లో చేపట్టిన అపార్ట్​మెంట్లు, విల్లా ప్రాజెక్టులన్నింటినీ ఒకే చోటికి ఈనాడు ప్రాపర్టీ(Eenadu Property Show)షో తీసుకువచ్చింది. నగరంలో లగ్జరీ అపార్ట్​మెంట్ ఆప్షన్స్​తో పాటు శివార్లలో విలాసవంతమైన విల్లాలను డెవలపర్లు ఆఫర్ చేస్తున్నారు. ఈనాడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాపర్టీషోలో వాసవీ, జనప్రియ, ఎన్ స్క్వేర్, రాజపుష్ప, హానర్ హోమ్స్, ఏపీఆర్ గ్రూప్, జైన్ కన్ స్ట్రక్షన్స్, ప్రగతి గ్రీన్ మెడోస్, పీవీర్ డెవలపర్స్, బీవీర్ ఇన్ ఫ్రా ఇలా మొత్తం 70 వరకు రియల్ ఎస్టేట్ సంస్థలు పాలుపంచుకుంటున్నాయి.

ఇదొక చక్కని వేదిక...

ఈనాడు నిర్వహిస్తోన్న ఈ ప్రాపర్టీషో (Eenadu Property Show)ద్వారా తమకు కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన వస్తోందని.. కస్టమర్ వాకిన్స్, ఫుట్​ఫాల్ ఎక్కువగా ఉండటంతో వ్యాపారం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దిగుమ మధ్యతరగతి నుంచి ప్రీమియం కస్టమర్లకు తాము అభివృద్ధి చేస్తోన్న ప్రాజెక్టుల ప్రదర్శనకు ఇదొక చక్కని వేదికగా నిలుస్తోందని వారంటున్నారు.

సందర్శకుల హర్షం...

కొవిడ్ తర్వాత సొంతింటి అవసరం పెరిగింది. అద్దె ఇంట్లో ఉన్నవారు సొంతిళ్లు కొనాలని చూస్తున్నారు. ఇప్పటికే ఉన్న వారు విశాలమైన ప్లాట్, విల్లాల కోసం చూస్తున్నారు. ఇవన్నీ వెరసి రియల్ ఎస్టేట్​కు మంచి డిమాండ్ ఏర్పడింది. వినియోగదారుల అన్ని అవసరాలు మీట్ అయ్యేలా పలువురు రియల్టర్లు ఇక్కడ ప్రాపర్టీలను ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్రాపర్టీ ప్రదర్శన ద్వారా ఇళ్ల స్థలాలు, ఫామ్ ల్యాండ్స్, ఫ్లాట్లపై నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఆఫర్లు, ధరలపై ఒక అవగాహన కలిగిందని, ఒక నమ్మకంతో కూడిన స్థిరాస్తి కొనుగోలు కోసం ఈనాడు చేస్తోన్న ఈ ప్రయత్నం తమకెంతో లాభదాయకంగా ఉందని సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రవేశం ఉచితం...

హైదరాబాద్ హైటెక్స్​లో రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రాపర్టీషో (Eenadu Property Show)ఉదయం పదిగంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కొనసాగుతుందని.. ఈ అవకాశాన్ని స్థిరాస్తి కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని, ప్రవేశం ఉచితమని నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చదవండి:huzurabad by elections 2021:పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, సీపీ.. ఆ వివరాలపై ఆరా...

ABOUT THE AUTHOR

...view details