ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా హైటెక్ సిటీ మెట్రో మార్గం ప్రారంభంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. వీవీప్యాడ్ల విషయంలో ప్రజల అనుమానాలు నివృత్తి చేయాలని, 50శాతం వీవీప్యాడ్లు లెక్కించాలని ఆ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు.నేతలు ఇచ్చిన సలహాలు, సూచనలను సీఈవో స్వీకరించారు. ఎన్నికల నియమావళిని, నిబంధనలను కచ్చితంగా అమలుచేయాలని అన్ని పార్టీలను కోరారు.
రాజకీయ పార్టీల కీలక నేతలతో ఈసీ కార్యశాల - ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోండి
లోక్ సభ ఎన్నికల కోసం ఈసీ అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నేతలతో వర్క్ షాప్ నిర్వహించింది. ఈవీఎంలు, వీవీప్యాడ్లపై నెలకొన్న అనుమానాలు, ఎన్నికల నిబంధనల అమలుపై నేతల అనుమానాలను సీఈవో రజత్ కుమార్ నివృత్తి చేశారు.

రాజకీయ పార్టీల కీలక నేతలతో ఈసీ కార్యశాల
రాజకీయ పార్టీల కీలక నేతలతో ఈసీ కార్యశాల