తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలి: సీపీ మహేశ్ భగవత్ - EACHA ND EVERY INDIVIDUAL SHOULD CO OPERATE WITH THE GOVERNMENTS SAYS CP MAHESH BAGAWATH

కరోనా వైరస్​ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ప్రజలంతా ప్రభుత్వ ఆదేశాలను తప్పక పాటించాలని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ కోరారు. నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఆదేశాలను తప్పక పాటించాలి : సీపీ
ప్రభుత్వ ఆదేశాలను తప్పక పాటించాలి : సీపీ

By

Published : Mar 23, 2020, 5:47 PM IST

కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా ప్రజలు నడుచుకోవాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సూచించారు. ప్రజలు కిరాణా షాపుల వద్ద సామాజిక దూరం పాటించడం లేదని సీపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకేసారి ఐదుగురుకి మించి బయట తిరగొద్దని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

స్వీయ నిర్బంధమే భేష్...

ఇప్పటికే పలు కేసులు నమోదు చేశామని సీపీ తెలిపారు. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే ఈ నెల 31 వరకు ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని స్పష్టం చేశారు. సాయంత్రం 6 నుంచి ఉదయం 7 గంటల వరకు ఎవరూ బయట తిరగవద్దని అన్నారు. పార్కులు, పబ్​లు, పర్యటక కేంద్రాలు, రవాణా వ్యవస్థ, క్యాబ్​లు తదితర అన్ని మూసివేశామని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితిల్లో తప్ప ఎవరూ ఇళ్లు విడిచి బయటకు రావొద్దన్నారు.

ప్రభుత్వ ఆదేశాలను తప్పక పాటించాలి : సీపీ

ఇవీ చూడండి : రాష్ట్రంలో 30కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details