సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు మరో ప్రయోగాన్ని మొదలుపెట్టారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమవంతుగా లాక్డౌన్ సమయంలో పెట్రోలింగ్ నిర్వహించేందుకు ఈ బైక్స్ పెట్రోలింగ్ విధానాన్ని ప్రారంభించారు. మొదటగా మాదాపూర్ పీఎస్ పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది ద్విచక్రవాహనాలపై చక్కర్లు కొడుతూ లాక్డౌన్ విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే వంద కిలోమీటర్లు రావడం.. అలాగే పర్యావరణ పరిరక్షణకు ఈ బైక్స్ ఎంతగానో దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు.
పర్యావరణ హితమే లక్ష్యంగా ఈ బైక్స్ పెట్రోలింగ్ - మాదాపూర్లో పోలీసుల ఈ బైక్స్ పెట్రోలింగ్
పర్యావరణ పరిరక్షణలో భాగంగా లాక్డౌన్ సమయంలో ఈ బైక్స్తో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. మొదటగా హైదరాబాద్ మాదాపూర్ పీఎస్ పరిధిలో ఎలక్ట్రానిక్ బైక్స్తో రహదారులపై పెట్రోలింగ్ చేపట్టారు.
మాదాపూర్లో ఈ బైక్స్ పెట్రోలింగ్
మాదాపూర్ పీఎస్ పరిధిలో విజయవంతం కావడంతో ఇక సైబరాబాద్ కమిషనరేట్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ బైక్స్ పెట్రోలింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి:థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బయోమాస్ వినియోగంపై జాతీయ మిషన్