తెలంగాణ

telangana

ETV Bharat / state

2018లో ఆర్​టీఏ అధికారి మృతి.. 2019లో సంతకం ప్రత్యక్షం - హైదరాబాద్​లో నకిలీ ఆర్​సీ ముఠా అరెస్ట్

2018లో మృతి చెందిన ఆర్​టీఏ అధికారి.. సంతకం 2019లో ప్రత్యక్షమవగా అవాక్కవడం సదురు అధికారుల వంతైంది. నకిలీ డాక్యుమెంట్లు తయారు చేస్తున్న తొమ్మిది మంది గల ముఠాను పోలీసులు గుర్తించారు.

Duplicate rc prepare gang arrest in hyderabad
2018లో ఆర్​టీఏ అధికారి మృతి

By

Published : Dec 19, 2019, 9:39 PM IST

మృతి చెందిన ఆర్​టీఏ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ మైక్రో చిప్​లు, ఆర్​సీలు తయారు చేస్తున్న 9 మంది గల ముఠా లోని 6 మందిని దక్షిణ మండలం టాస్క్​ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 27 పీవీసీ కార్డులు, నకిలీ ఆర్​సీలు, వాటిని తయారు చేసే యంత్రం, ప్రింటర్ మానిటర్​ను స్వాధీనం చేసుకున్నారు.

గతంలో దక్షిణ మండలం ఆర్టీఏ అధికారిగా పనిచేసిన నీల్ విక్టర్ 2018లో మరణించారు. ఆయన సంతకంతో ఫోర్జరీ అయిన ఒక వాహన ఆర్​సీ.. యజమాని బదలాయింపునకు దక్షిణ మండలం బండ్లగూడలో ఉన్న ఆర్​టీఏ కార్యాలయంలో దరఖాస్తుకు వచ్చింది. 2019లో తయారైన ఆర్​సీని పరిశీలించిన అధికారులు 2018లో మరణించిన అధికారి సంతకం చూసి అవాక్కయ్యారు. ఏదో మోసం జరుగుతోందని.. గుర్తించిన చాంద్రాయణగుట్ట పోలీస్​స్టేషన్​లో దక్షిణ మండలం ఆర్​టీఏ అధికారి సదానందం ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన టాస్క్​ఫోర్స్ పోలీసులు దళారులను విచారించి అసలు ముఠాను పట్టుకున్నారు. రాజేంద్రనగర్ పోలీస్​స్టేషన్​ పరిధిలోని హసన్​నగర్​కు చెందిన ఆఫ్రోజ్ ఆర్​టీఏ ఏజెంట్... మరో 8 మందితో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. 6 నెలల నుంచి ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్​సీలు లేని, సీజైన, యజమాని లేని, వాహనాలకు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితులను టాస్క్​ఫోర్స్ పోలీసులు​ విచారణ నిమిత్తం చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు.

నకిలీ డాక్యుమెంట్లు తయారు చేస్తున్న ముఠా

ఇవీ చూడండి: వరకట్నం కోసం వేధింపులు.. గర్భవతి ఆత్మహత్య

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details