తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్‌ సభకు ఏపీ బస్సులు.. ప్రయాణికులకు తప్పని తిప్పలు - BRS public meeting in Khammam latest news

ఏపీ విజయవాడ నగరంలో సిటీ బస్సుల కొరత కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో భారత్ రాష్ట్ర సమితి బహిరంగ సభకు ఇక్కడి బస్సులను తరలించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్​కు అన్నివిధాలుగా సహకారం అందిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శించారు.

AP
AP

By

Published : Jan 18, 2023, 10:27 PM IST

ఆంధ్రప్రదేశ్ విజయవాడలో సిటీ బస్సుల కొరతతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ డిపోలకు చెందిన బస్సులు బీఆర్ఎస్ సభకు తరలింపుపై విమర్శలు వెల్లువెత్తాయి. గవర్నరుపేట, విద్యాధరపురం, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, తిరువూరు డిపోల బస్సులు బీఆర్ఎస్ జెండాలతో ఖమ్మం బాట పట్టాయి. కేసీఆర్‌, జగన్ వేరు కాదు.. బీఆర్‌ఎస్‌ సభకు రాష్ట్రంనుంచి పెద్ద ఎత్తున బస్సులు పంపుతున్నారని మాజీ మంత్రి జవహర్ విమర్శించారు.

రాష్ట్రం నుంచి బస్సులను కేటాయించటంలో అర్థం ఏమిటో చెప్పాలని మాజీ మంత్రి జవహర్ డిమాండ్‌ చేశారు. జగన్.. పెద్దన్నకు, పెద్దన్న.. జగన్​కు పరస్పర సహకారం కొత్తేమీ కాదని విమర్శించారు. 2019 ఎన్నికల్లో జగన్‌కు సహకరించినందుకు రిటర్న్ గిప్ట్ ఇస్తున్నారని అన్నారు. జగన్ గుంట నక్క వేషాలు ప్రజలు గమనిస్తున్నారని జవహర్‌ పేర్కొన్నారు.

కేసీఆర్‌ సభకు ఏపీ బస్సులు.. ప్రయాణికులకు తప్పని తిప్పలు

ABOUT THE AUTHOR

...view details