తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైల్వే స్టేషన్ సమీప రోడ్లపై చెత్తను వేయకూడదు' - రైల్వే అధికారులు

స్వచ్ఛత, పరిశుభ్రతపై దేశవ్యాప్త కార్యక్రమాన్ని రైల్వే శాఖ చేపట్టింది. రెండు వారాల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమం ముగింపు దశకు వచ్చిందని హైదరాబాద్ రైల్వే డీఆర్​ఎం ప్రసాద్ తెలిపారు.

రైళ్లు, రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి : హైదరాబాద్ డీఆర్​ఎం

By

Published : Sep 28, 2019, 10:48 PM IST

రైల్వే స్వచ్ఛత పక్వడా నినాదంతో రైల్వే అధికారులు రెండు వారాలుగా దేశ వ్యాప్తంగా పరిశుభ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా రైళ్లు, రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో శుభ్రత, ప్లాస్టిక్​పై నిషేధం, తదితర అంశాలను పరిశీలించనున్నారు. హైదరాబాద్​లోని పాతబస్తీ, ఉప్పుగూడ రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హైదరాబాద్ రైల్వే ఉన్నతాధికారి ఎన్​ఎస్ఆర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జీహెచ్​ఎంసీ, ఐటీసీతో సహా స్థానిక వాలంటీర్లతో కలిసి స్టేషన్ సమీప ప్రాంతంలోని చెత్తను తొలగించారు. చెత్తను రైల్వే స్టేషన్ సమీపంలోని రోడ్లపై వేయకూడదని నివాసం చుట్టూ ఉన్న స్థానికులకు సూచించారు. అనంతరం ప్లాస్టిక్​ను వినియోగించొద్దని అవగాహన కల్పించారు.

రైళ్లు, రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి : హైదరాబాద్ డీఆర్​ఎం

ABOUT THE AUTHOR

...view details