ఆర్టీసీ కార్మికులు నేడు విధులకు హాజరయ్యే వేళ ఎలాంటి ఆటంకాలు కలిగించొద్దని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ఐకాస సమ్మె విరమణ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని ఆయన అభివర్ణించారు. కార్మికులు విధుల్లో చేరడం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యను సీఎం కేసీఆర్ మనవతా దృక్పథంతో చూడాలని కోరారు. ఏవైనా ఆటంకాలు కలిగించినట్లయితే... అది శాంతిభద్రతల సమస్యగా మారే అవకాశం ఉందని... ఇందుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
'విధులకు హాజరయ్యే వేళ ఆటంకాలొద్దు'
కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా ఆర్టీసీ ఐకాస సమ్మె విరమింపజేయడం ఆహ్వానించదగ్గ పరిణామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కార్మికులు విధుల్లో చేరుతున్నందున వారికి ఎలాంటి ఆటంకాలు కలిగించవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యను మనవతా దృక్పథంతో చూడాలి : జగ్గారెడ్డి