తెలంగాణ

telangana

ETV Bharat / state

హెర్నియా సర్జరీకి వెళ్తే కిడ్నీ మాయం - రూ. 30 లక్షలు చెల్లించాలని వినియోగదారుల కమిషన్ ఆదేశం

Doctors Stole Kidney Of A Patient in Hyderabad : హెర్నియా ఆపరేషన్​కు ఆసుపత్రికి వెళితే కిడ్నీ మాయమైన ఘటన హైదరాబాద్​లో జరిగింది. ఆపరేషన్​ చేయించుకున్న తర్వాత మూత్రపిండం మాయమైందని బాధితుడు రాష్ట్ర వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించాడు. ఈ విషయంలో వైద్యుల తీరును ఆ కమిషన్​ తప్పుబట్టింది. ఇందుకు పరిహారంగా రూ.30 లక్షలు ఇవ్వాలని, వాటితో పాటు ఖర్చుల కింద రూ.25 వేలు ఇవ్వాలని డాక్టర్లను ఆదేశించింది.

By ETV Bharat Telangana Team

Published : Dec 18, 2023, 1:08 PM IST

Doctors Stole Kidney
Doctors Stole his Kidney During Hernia Operation in Hyderabad

Doctors Stole Kidney Of A Patient in Hyderabad :వైద్యులను దేవుళ్లతో సమానంగా భావిస్తారు. ఎందుకంటే ఏదైనా రోగం వచ్చినప్పుడు చావు నుంచి తప్పించి, పునర్జన్మనిస్తాడని. దైవంగా భావించి వైద్యులు తమ ప్రాణాన్ని నిలబెడతారని రోగులు వారిపై నమ్మకాన్ని ఉంచుతారు. ఈ నమ్మకాన్నే ఆసరాగా తీసుకొని కొందరు డాక్టర్లు నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్​లో చోటుచేసుకుంది. రోగికి ఆపరేషన్​ పేరుతో కిడ్నీని మాయం చేశారు. ఇలా చేసినందుకు రోగికి పరిహారంగా రూ.30 లక్షలు, రూ.25 వేలు ఖర్చుల కోసం ఇవ్వాలని కోర్టు ఆ డాక్టర్లను ఆదేశించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే :ఖమ్మ జిల్లా కొత్తగూడెంకు చెందిన రేణుకుంట్ల రవిరాజు వాహన మెకానిక్​గా పని చేస్తున్నాడు. ఆయనకు 2007లో కడుపు నొప్పి రావడంతో హైదరాబాద్​గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital)లో చేరగా వైద్యులు ఆపరేషన్​ చేశారు. ఆ తర్వాత 2009 జులైలో హెర్నియా సమస్యతో సికింద్రాబాద్​లోని పౌలోమి ఆసుపత్రిలో చేరగా అక్కడి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి రెండు కిడ్నీలు సాధారణంగానే ఉన్నాయని చెప్పారు. రాజీవ్​ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రవిరాజుకు ఆపరేషన్​ నిర్వహించి, జులై 31న డిశ్ఛార్జి చేశారు.

Kidney Thefts in Hyderabad :ఆ తర్వాతబాధితుడు 2011లో కోల్​కతాలోని తన బంధువుల ఇంటికి వెళ్లగా మరోసారి కడుపు నొప్పి రావడంతో అక్కడే ఉన్న ఆసుపత్రిలో చూపించుకుని హెర్నియాకు ఆపరేషన్​ చేసుకున్నారు. ఈ చికిత్సకు ముందు జరిపిన పరీక్షల్లో ఎడమవైపు కిడ్నీ(Kidney) కనిపించడం లేదని వైద్యులు తెలిపారు. ఆ మాటలను పట్టించుకోని బాధితుడు, మళ్లీ 2012లో కడుపు నొప్పి రావడంతో ఖమ్మం మెడికేర్​ డయాగ్నోస్టిక్​ సెంటర్​, మమత మెడికల్​ కాలేజీల్లో పరీక్షలు చేయించుకున్నారు.

అక్కడ కూడా ఒక కిడ్నీ లేదన్న విషయాన్ని తెలుసుకుని వెంటనే వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించాడు. హెర్నియా ఆపరేషన్​ సమయంలో పౌలోమి ఆసుపత్రి వైద్యులు తనకు తెలియకుండా కిడ్నీని తొలగించారని, దానిని రూ.50 లక్షలకు అమ్ముకున్నారని బాధితుడు ఆరోపించారు. కిడ్నీ లేని లోటు తన జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అందుకు రూ.50 లక్షలు పరిహారం డాక్టర్లు చెల్లించేలా చూడాలని వినియోగదారుల కమిషన్​ను బాధితుడు కోరారు.

కిడ్నీ రాకెట్​ గుట్టు రట్టు... ప్రధాన నిందితుడు శ్రీనివాస్ అరెస్ట్

వినియోగదారుల కమిషన్​ సీరియస్​ : ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకున్న రాష్ట్ర వినియోగదారుల కమిషన్​(Consumer Court) ఆసుపత్రి వైద్యుల తీరును తప్పుబట్టింది. దీనికి పరిహారంగా రూ.30 లక్షలు, ఖర్చులకు రూ.25 వేలు చెల్లించాలని సికింద్రాబాద్​ పౌలోమి ఆసుపత్రికి చెందిన డాక్టర్​ నందకుమార్​ బి.మధేకర్​, డాక్టర్​ ప్రసాద్​ బెహరాలకు ఆదేశించింది. ఈ తీర్పును కమిషన్​ సభ్యులు వివి శేషుబాబు, ఆర్​.ఎస్​.రాజెశ్రీలతో కూడిన ధర్మానం వెలువరించింది.

రుజువుల సమర్పణలో వైద్యుల విఫలం : అయితే పౌలోమి ఆసుపత్రి డాక్టర్లు మాత్రం బాధితుడి ఆరోపణలను తోసిపుచ్చారు. తమ ఆసుపత్రికి రాకముందే ఫిర్యాదుదారుడు పలు శస్త్రచికిత్సలు చేసుకున్నాడని తెలిపారు. ఈ క్రమంలో కిడ్నీ కనిపించడం లేదంటే దాన్ని తొలగించినట్లు కాదని, మూత్రపిండాలు క్షీణించే దశలో కూడా ఇలా జరిగే అవకాశం ఉందన్నారు. డిశ్ఛార్జి సమయంలో స్కానింగ్​ నిర్వహించినప్పుడు కిడ్నీలు సాధారణంగా ఉన్నాయని తేలిందని, పిటిషన్​ను కొట్టివేయాలని కోరారు.

ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం డాక్టర్లు పొరపాటు చేయలేదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది. డిశ్చార్జి చేసే ముందు అల్ట్రాసౌండ్​ పరీక్ష చేసినట్లు రుజువులు సమర్పించడంలో డాక్టర్లు విఫలమయ్యారని కోర్టు పేర్కొంది. అందువల్ల వారు తప్పు చేసినట్లుగా భావించాల్సి వస్తోందని చెప్పింది. ఆపరేషన్​ ముసుగులో చట్టవిరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలను వారు తిరస్కరించలేని పరిస్థితి ఉందంది. ఫిర్యాదుదారు అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేసినట్లుగా ఉందని, అందువల్ల పరిహారం చెల్లించాల్సిందేనని పేర్కొంది. బాధితుడికి జరిగిన నష్టాన్ని పూరించలేమని కనీస పరిహారంగా రూ.30 లక్షలు, ఖర్చులు కింద రూ.25 వేలు చెల్లించాలని తీర్పును వెలువరించింది.

కిడ్నీ అమ్మాలనుకుంది.. రూ.16 లక్షలు పోగొట్టుకుంది

ఈ జాగ్రత్తలతో కిడ్నీలను కాపాడుకోండి!

ABOUT THE AUTHOR

...view details