తెలంగాణ

telangana

By

Published : Jun 17, 2020, 3:54 AM IST

ETV Bharat / state

8 కేంద్రాల్లో... 1600 శాంపిల్స్ సేకరణ

గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాలలో పెరుగుతున్న కరోనా వైరస్​ వ్యాప్తిని నిరోధించటానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా 50వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలన్న సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు మంగళవారం 8 కేంద్రాల్లో 1600 శాంపిల్స్​ను వైద్యాధికారులు సేకరించారు.

Doctors from Greater Hyderabad took 1600 corona samples on Tuesday
8 కేంద్రాల్లో... 1600 శాంపిల్స్ సేకరణ 8 కేంద్రాల్లో... 1600 శాంపిల్స్ సేకరణ 8 కేంద్రాల్లో... 1600 శాంపిల్స్ సేకరణ

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వైద్యాధికారులు మంగళవారం 1600 కరోనా శాంపిల్స్‌ సేకరించారు. ఇందుకు సంబంధించి జీహెచ్‌ఎంసీ పరిధిలోని 8 కేంద్రాల్లో మొదటి, రెండో కాంటాక్టు వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. శేరిలింగంపల్లి జోన్‌ నుంచి 210, కూకట్‌పల్లి జోన్‌లో 45, ఎల్‌బీనగర్‌లో 240, సికింద్రాబాద్‌లో 151, ఖైరతాబాద్‌లో 575, చార్మినార్‌జోన్‌లో 379 శాంపల్స్​ అధికారులు సేకరించినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details