హైదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలోని ఇద్దరు విద్యార్థులు హిమబిందు, జమాల్లకు డాక్టరేట్ లభించింది. వారి పరిశోధనలకు మార్గదర్శకత్వం వహిస్తున్న గీతమ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ కె.మంజునాథాచారి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామంలో ఉన్న విశ్వవిద్యాలయం స్కాలర్లు హిమబిందు, జమాల్లు సమర్పించిన సిద్ధాంత వ్యాసాలతో పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించారని మంజునాథచారి తెలిపారు.
సహజ లక్షణాల సంగ్రహణ, వర్గీకరణ పద్ధతులను ఉపయోగించి ముఖాన్ని గుర్తించడంపై అధ్యయనం, విశ్లేషణ, దానిపై సిద్ధాంత వ్యాసాన్ని హిమబిందు సమర్పించారని, ముఖ గుర్తింపు వ్యవస్థ మూడు విధానాలను అభివృద్ధి చేయడం ద్వారా లక్ష్యాలను సాధించినట్టు ఆయన తెలిపారు. మొదటి విధానంలో కేఏఎఫ్టీని ఉపయోగించి ముఖాన్ని గుర్తించడం, వర్గీకరణ చేయడానికి కెర్నల్ ఆధారిత గోళాకార ఏఎం వర్గీకరణను ప్రతిపాదించారన్నారు. రెండో విధానంలో ఎం-కో- హాగ్ పద్ధతిలో ముఖ లక్షణాల సంగ్రహణ, వర్గీకరణ కోసం, న్యూరల్ నెట్వర్క్, మసక వ్యవస్థ కలయిక సంభావ్య న్యూరో-ఫజి వ్యవస్థను రూపొందించడానికి ప్రతిపాదించినట్టు తెలిపారు. మూడో విధానంలో వర్గీకరణ కోసం ఈఎమ్ఎఫ్వో ఆధారిత డీప్ బిలీఫ్ నెట్వర్క్ను అభివృద్ధి చేశామన్నారు. ప్రతి విధానం పనితీరు ప్రయోగాత్మకంగా విశ్లేషించడంతో పాటు సీవీఎస్ ఫేస్ డేటాబేస్ ఉపయోగించి ఇప్పటికే ఉన్న ఇతర విజయవంతమైన పద్ధతులతో పోల్చి, నియంత్రిత వాతావరణంలో మంచిఫలితాలను ఇస్తుందని నిరూపించినట్టు డాక్టర్ మంజునాథాచారి తెలియజేశారు.