తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏ ఒక్కరినీ ఆందోళనకు గురి చేయరాదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రైవేట్ హాస్టళ్ల నుంచి విద్యార్థులు, ఇతర వర్కింగ్ పర్సన్స్ను యాజమాన్యాలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు పంపవద్దని మంత్రి సూచించారు.
వసతిగృహాల్లో ఉన్నవారిని బయటకు పంపవద్దు: మంత్రి కేటీఆర్ - Minister KTR On Hostels
ప్రైవేట్ వసతిగృహాల్లోని విద్యార్థులు, వర్కింగ్ పర్సన్స్ను బయటకు పంపవద్దని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హాస్టళ్లలో ఉన్నవారిని వెళ్లిపోవాలంటూ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్న తరుణంలో మంత్రి స్పందించారు.
![వసతిగృహాల్లో ఉన్నవారిని బయటకు పంపవద్దు: మంత్రి కేటీఆర్ KTR On Hostels](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6544821-983-6544821-1585184689654.jpg)
KTR On Hostels
వసతిగృహ నిర్వాహకులకు ప్రభుత్వం అన్నివిధాల అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు.
వసతిగృహాల్లో ఉన్నవారిని బయటకు పంపవద్దు : మంత్రి కేటీఆర్
ఇదీ చూడండి :సాయం చేయండి అంటూ కేటీఆర్కు ట్వీట్లు