లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికులుకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఒక్కోమనిషికి 12 కిలోల చొప్పున బియ్యం, నగదు పంపిణీ చేస్తోంది. హైదరాబాద్ ఎస్.ఆర్.నగర్లో ఏర్పాటు చేసిన చౌక దుకాణంలో పెద్ద ఎత్తున వలస కూలీలకు బియ్యం పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.
బియ్యం కోసం క్యూ కట్టిన వలస కార్మికులు - ఎస్ఆర్నగర్లో వలస కార్మికులకు బియ్యం పంపిణి
వలస కార్మికులకు ప్రజా పంపిణీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బియ్యంతో పాటు నగదును అందజేస్తోంది. ఎస్.ఆర్.నగర్లోని మోడల్ కాలనీకి పెద్ద ఎత్తున ఒడిశా, బిహార్, ఉత్తర్ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు తరలి వచ్చి ప్రభుత్వ సాయం తీసుకున్నారు.
![బియ్యం కోసం క్యూ కట్టిన వలస కార్మికులు Distribution of rice and cash to migrants at sr nagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6620343-thumbnail-3x2-migrant-rk.jpg)
బియ్యం కోసం క్యూ కట్టిన వలస కార్మికులు
TAGGED:
హైదరాబాద్ తాజా వార్తలు