తెలంగాణ

telangana

By

Published : Jan 7, 2021, 6:32 PM IST

ETV Bharat / state

ఎన్​ఎండీసీ కార్యాలయంలో ఔషధ మొక్కల పంపిణీ

ఎన్​ఎండీసీ కార్యాలయంలో ఔషధ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఆ సంస్థ ఛైర్మన్​, ఎండీ సుమిత్​ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాంతిగిరి ఆశ్రమ స్వామీజీ ప్రాణవసుదన్​ పాల్గొన్నారు.

Distribution of Medicinal Plants
ఎన్​ఎండీసీ కార్యాలయంలో ఔషధ మొక్కల పంపిణీ

హైదరాబాద్​లో శాంతిగిరి ఆశ్రమం, ఎన్ఎండీసీ సంయుక్తంగా పదివేల ఔషధ మొక్కల పంపిణీ చేపట్టాయి. ఎన్ఎండీసీ ఛైర్మన్​, డైరెక్టర్ సుమిత్​, స్వామీజీ ప్రాణవసుదన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాలల విద్యార్థులకు ఔషధ మొక్కలతో పాటు సేంద్రియ ఎరువులను అందించారు.

ఇదో మంచి కార్యమని.. అందులోనూ చిన్నారులను భాగస్వామ్యం చేయడం సంతోషకరమైన విషయమని సుమిత్​ అన్నారు. ఔషధ మొక్కల గొప్పతనాన్ని నలుదిక్కుల చాటిచెబుతున్న శాంతిగిరి ఆశ్రమానికి ధన్యవాదాలు తెలిపారు.

ఇవీచూడండి:కోడి మాంసం, గుడ్లు తినడం ఎంతవరకు సురక్షితం?!

ABOUT THE AUTHOR

...view details