తెలంగాణ

telangana

వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ

హైదరాబాద్​ పీఎన్​టీ కాలనీలోని వరద బాధితులకు స్వామి వివేకానంద సెంటినరీ హైస్కూల్​ పూర్వ విద్యార్థులు, యూపీఎన్​టీ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

By

Published : Oct 24, 2020, 8:44 PM IST

Published : Oct 24, 2020, 8:44 PM IST

Distribution of essentials to flood victims
వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ

భారీ వర్షాలతో అతలాకుతలమైన హైదరాబాద్​లో​ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే గడ్డి అన్నారం పీఎన్​టీ కాలనీలోని కమిటీ హాల్​లో స్వామి వివేకానంద సెంటినరీ హైస్కూల్​ పూర్వ విద్యార్థులు, యూపీఎన్​టీ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పీఎన్​టీ కాలనీ, కోదండరామ్ నగర్ పరిసర ప్రాంతాల్లోని బాధితులకు ఆహార ప్యాకెట్లు, నిత్యావసరాలు అందజేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details