భారీ వర్షాలతో అతలాకుతలమైన హైదరాబాద్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే గడ్డి అన్నారం పీఎన్టీ కాలనీలోని కమిటీ హాల్లో స్వామి వివేకానంద సెంటినరీ హైస్కూల్ పూర్వ విద్యార్థులు, యూపీఎన్టీ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పీఎన్టీ కాలనీ, కోదండరామ్ నగర్ పరిసర ప్రాంతాల్లోని బాధితులకు ఆహార ప్యాకెట్లు, నిత్యావసరాలు అందజేశారు.
వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ
హైదరాబాద్ పీఎన్టీ కాలనీలోని వరద బాధితులకు స్వామి వివేకానంద సెంటినరీ హైస్కూల్ పూర్వ విద్యార్థులు, యూపీఎన్టీ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ
TAGGED:
essentials Distribution